900 కోట్లు విడుదల చేయండి: వినోద్ కుమార్
ABN , First Publish Date - 2021-12-31T00:18:45+05:30 IST
రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 900 కోట్ల నిధులను విడుదల
ఢిల్లీ: రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 900 కోట్ల నిధులను విడుదల చేయాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. నగరంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు కలిశారు. తెలంగాణ రాష్టానికి విభజన చట్టం ప్రకారం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద 24,205 కోట్లు సిఫార్సు చేసినందుకు రాజీవ్కు వినోద్ కృతజ్ఞతలు తెలిపారు.
వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని గతంలో నీతి ఆయోగ్ సిపార్సు చేసిందని ఆయనకు వినోద్ గుర్తు చేశారు. గతంలో తెలంగాణలో 9 జిల్లాలు వెనకబడి ఉన్నాయన్నారు. వాటికి రావాల్సిన నిధులు ఇంకా విడుదల చేయలేదని వినోద్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే అందులో 32 జిల్లాలు వెనకబడి ఉన్నాయన్నారు. వాటి అభివృద్ధికి 900 కోట్ల నిధులను విడుదల చేయాలని వినోద్ కోరారు.