23న విద్యా సంస్థల రాష్ట్ర బంద్
ABN , First Publish Date - 2022-08-19T06:38:44+05:30 IST
విద్యారంగం సమస్యల పరిష్కారానికి ఈనెల 23న జరిగే విద్యా సంస్థల రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
సిరిపురం, ఆగస్టు 18: విద్యారంగం సమస్యల పరిష్కారానికి ఈనెల 23న జరిగే విద్యా సంస్థల రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం రాష్ట్ర బంద్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన విద్యా విధానం 2020 రద్దు చేయాలని, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనాన్ని ఆపాలన్నారు.
జీవో నెంబరు 84, 85, 117, 128లను రద్దు చే యాలని డిమాండ్ చేశారు. పాఠ్య, నోట్ పుస్తకాలు, విద్యాకానుక, యూనిఫారాలు పూర్తిస్థాయిలో అందజేయాలన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, బైజూస్ ఒప్పందం రద్దుతోపాటు ప్రభుత్వమే ఉచిత ట్యాబ్లు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.నాగరాజు, ప్రధాన కార్యదర్శి జి.ఫణీంద్రకుమార్, నాయుడు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.