అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-07-01T06:36:52+05:30 IST
అవనిగడ్డ ఎనిమిదో వార్డులో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్.అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలను మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ గురువారం ఆవిష్కరించారు.
అవనిగడ్డ టౌన్ : అవనిగడ్డ ఎనిమిదో వార్డులో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్.అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలను మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ గురువారం ఆవిష్కరించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమే్షబాబు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి విగ్రహాలను ఆవిష్కరించారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇతోధికంగా కృషి చేస్తున్నారన్నారు. ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, వైసీపీ నేతలు కడవకొల్లు నరసింహారావు, సర్పంచ్ గొరుముచ్చు ఉమా, ఎంపీపీ తుంగల సుమతిదేవి, జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ, మేడికొండ విజయలక్ష్మి, గాజుల జై గోపాల్, నలుకుర్తి రమేష్, కొల్లూరి సాయిబాబు, దిడ్ల ప్రసాద్, అన్నపరెడ్డి వెంకట స్వామి, పులిగడ్డ సర్పంచ్ దాసరి విజయ్ కుమార్, పులిగడ్డ పిచ్చేశ్వరరావు, బుజ్జి, కాంతారావు, కొల్లూరి సాయిబాబు పాల్గొన్నారు.