వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2021-05-07T06:49:25+05:30 IST
దొనకొండ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఆనంద ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన అన్నపూర్ణదేవి సమేత కాశీవిశ్వేశ్వర దేవాలయంలో ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ఠ వేడుకలను ధర్మకర్త కాకర్ల భైరవానందస్వామి నేతృత్వంలో గురువారం వైభవంగా నిర్వహించారు.
దొనకొండ, మే 6 : దొనకొండ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఆనంద ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన అన్నపూర్ణదేవి సమేత కాశీవిశ్వేశ్వర దేవాలయంలో ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ఠ వేడుకలను ధర్మకర్త కాకర్ల భైరవానందస్వామి నేతృత్వంలో గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 7 నుంచి వివిధపూజలతోపాటు శివ పార్వతుల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు.