ఇళ్లలో ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
ABN , First Publish Date - 2021-05-10T05:10:14+05:30 IST
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎస్పీ సుభాష్ సూచించారు.
పార్వతీపురం టౌన్, మే 9: కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎస్పీ సుభాష్ సూచించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తరువాత పట్టణంలో కర్ఫ్యూ అమలును పరిశీలించారు. అనవస రంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, చేతు లను తరచూ శానిటేజర్తో శుభ్రం చేసుకో వాలని సూచించారు. భౌతికదూరాన్ని పాటించాలన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.