ఇళ్లలో ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

ABN , First Publish Date - 2021-05-10T05:10:14+05:30 IST

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎస్పీ సుభాష్‌ సూచించారు.

ఇళ్లలో ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
కర్ఫ్యూ అమలును పరిశీలిస్తున్న డీఎస్పీ

పార్వతీపురం టౌన్‌, మే 9: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎస్పీ సుభాష్‌ సూచించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తరువాత పట్టణంలో కర్ఫ్యూ అమలును పరిశీలించారు. అనవస రంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, చేతు లను తరచూ శానిటేజర్‌తో శుభ్రం చేసుకో వాలని సూచించారు. భౌతికదూరాన్ని పాటించాలన్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-05-10T05:10:14+05:30 IST