‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి’
ABN , First Publish Date - 2022-06-27T05:32:06+05:30 IST
మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆత్మకూరు సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు సూచించారు.
ఆత్మకూరు, జూన్ 26: మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆత్మకూరు సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు సూచించారు. మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరులోని న్యాయస్థానం ఆవరణలో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పొగాకు, గంజాయి తదితర మత్తు పదార్థాల వల్ల తీవ్ర దుష్ఫలితాలు ఉంటాయని తెలిపారు. మత్తు పదార్థాల వల్ల అనర్థాలపై ప్రజలు అవగాహన కల్పించాలని సూచించారు. బార్ అసోషియేషన్ అధ్యక్షుడు గిరిరాజు, ఏపీపీ రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.