రాజకీయాలకు దూరంగా ఉండండి...మిలటరీకి Pak Army Chief బజ్వా ఆదేశం
ABN , First Publish Date - 2022-07-05T17:48:19+05:30 IST
పాకిస్థాన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ (సీఓఏఎస్) జనరల్ కమర్ జావేద్ బజ్వా తాజాగా సంచలన ఆదేశాలు జారీ...
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ (సీఓఏఎస్) జనరల్ కమర్ జావేద్ బజ్వా తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేశారు.మిలటరీ,ఐఎస్ఐ అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండాలని పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా ఆదేశించారు.దేశ కమాండర్లు, ఐఎస్ఐతో సహా ఇతర కీలక అధికారులు రాజకీయాలకు దూరంగా ఉండాలని, రాజకీయ నాయకులతో సంభాషించవద్దని జనరల్ కమర్ జావేద్ బజ్వా కోరారు.పంజాబ్లో జరగనున్న ఉప ఎన్నికలను పిటిఐకి ప్రతికూలంగా మార్చేందుకు పాకిస్థాన్ మిలిటరీ నిమగ్నమైందని నివేదికల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు.
తమ పార్టీ అభ్యర్థులకు గుర్తు తెలియని నంబర్ల నుంచి టెలిఫోన్ కాల్స్ వస్తున్నట్లు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫిర్యాదు చేశారని బజ్వా పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)ని ఆ సంస్థ అధిపతి ఆదేశించారు. రాజకీయ విషయాల్లో జోక్యాన్ని సహించబోమని ఐఎస్ఐ డీజీ లెఫ్టినెంట్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులను ఆదేశించారు.