Rajahmundry: క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
ABN , First Publish Date - 2022-07-11T13:49:46+05:30 IST
ఎగవ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.
రాజమండ్రి: ఎగవ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి(Godavari) వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 6.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారేజీ 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేసి 3 లక్షల 22 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేశారు. వరద నీటి ప్రవాహంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు వేసిన తాత్కాలిక రోడ్లు కొట్టుకపోయాయి. దీంతో ప్రజలు నాటుపడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.