నగదు, నగలు చోరీ

ABN , First Publish Date - 2020-12-04T04:47:43+05:30 IST

మండలంలోని తడ కండ్రిగ పంచాయతీ దళితవాడలో ఒక ఇంట్లో నగదు, నగలు చోరీ జరిగింది. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది.

నగదు, నగలు చోరీ

తడ,  డిసెంబరు 3 : మండలంలోని తడ కండ్రిగ  పంచాయతీ దళితవాడలో ఒక ఇంట్లో నగదు, నగలు చోరీ జరిగింది. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు తడ కండ్రిగ పంచాయతీ దళితవాడలో పి. చిరంజీవి పూరిగుడిసెలో ఉంటూ పక్కనే ఇంటిని  నిర్మిస్తున్నాడు. వర్షం కారణంగా రెండు రోజుల నుంచి శ్లాబు వేసిన కొత్త ఇంట్లోనే ఉంటున్నాడు. గురువారం నగదు కోసం పూరిగుడిసెలో ఉన్న బీరువా తెరిచాడు. రూ. 60,500 నగదు, 4 సవర్ల బంగారు ఆభరణాలు, 3 జతల వెండి గొలుసులు కనిపించలేదు.  చోరీ జరిగిందని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీరువాకు వేసిన తాళం అలాగే ఉందని, అవన్నీ చోరీకి గురయ్యాయని  ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-04T04:47:43+05:30 IST