ఐక్యంగా ఉక్కు ఉద్యమం

ABN , First Publish Date - 2021-03-01T09:02:05+05:30 IST

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి

ఐక్యంగా ఉక్కు ఉద్యమం

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి పిలుపు 


కూర్మన్నపాలెం(విశాఖపట్నం), ఫిబ్రవరి 28: కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో గత 17 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. 5న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ఏపీఎ్‌సఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.సుందరయ్య మద్దతు ప్రకటించారు. నిరాహార దీక్షలో స్టీల్‌ ప్లాంట్‌ సెంట్రల్‌ స్టోర్స్‌, అడ్మిన్‌, టౌన్‌ అడ్మిన్‌, వీఎ్‌సజీహెచ్‌, టీటీఐ, ఓట్‌ సైడ్‌ విభాగాల కార్మికులు కూర్చున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు జె.అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T09:02:05+05:30 IST