చిరుధాన్యాల సాగు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-10-01T03:31:15+05:30 IST

జిల్లాలో చిరుధాన్యాల సాగు పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రం లోని కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయితో కలిసి చిరుధాన్యాలసాగు పౌష్టిక ఆహా రం అందజేతపై శిశుసంక్షేమశాఖ అధికారులతో, ఎన్జీ వో సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

చిరుధాన్యాల సాగు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 30: జిల్లాలో చిరుధాన్యాల సాగు పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రం లోని కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయితో కలిసి చిరుధాన్యాలసాగు పౌష్టిక ఆహా రం అందజేతపై శిశుసంక్షేమశాఖ అధికారులతో, ఎన్జీ వో సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న భూమికి అనుకూలంగా ఉన్న జొన్నసాగు విస్తీర్ణం పెంచాలన్నారు. దీనికితోడు రాగులు,ససజ్జలు, కొర్రలు, సామలు లాంటివి సాగుచేసేలా గ్రామాల్లో పెద్దఎ త్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీనికి ప్రభుత్వం విత్తనాలు అందజేస్తుందనే విష యాన్ని వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారిని సావిత్రి, సీడీపీవోలు, ఎన్జీవో సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

భీం వర్ధంతికి ఏర్పాట్లు పూర్తి

ఈనెల 9న జోడేఘాట్‌లో నిర్వహించే కుమరం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వ హణ కమిటీ సభ్యులతో కలిసి వర్ధంతి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వర్ధంతి నాటికి జోడేఘాట్‌లో పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించి నట్లు తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంతో పాటు మ్యూజియం చుట్టు ప్రహరీ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతు న్నాయని తెలిపారు.

Updated Date - 2022-10-01T03:31:15+05:30 IST