కరోనా కట్టడికి చర్యలు : ఎమ్మెల్యే ఆనంద్
ABN , First Publish Date - 2022-01-22T05:43:06+05:30 IST
కరోనా కట్టడికి చర్యలు : ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, జనవరి 21 : కరోనా విపత్తును ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్టీ-పీసీఆర్ ల్యాబ్ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందని పరిశీలించి మొదటి, రెండవ డోసుల వ్యాక్సినేషన్ రోజుకు ఎంతమంది తీసుకుంటున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనతో బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రయ్యకు ఎమ్మెల్యే స్వయంగా కరోనా టీకా వేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యసిబ్బంది, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.