కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-02-28T05:26:53+05:30 IST
మండలంలోని మజ్జిలిపేటలో శుక్రవారం అర్ధరాత్రి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ దేవానంద్ కథనం మేరకు.... హైదరాబాద్లో భర్త గౌరీతో పాటు ఉంటున్న పైడి ఝాన్సీ (30) ఎనిమిది నెలల కిందట ప్రసవానికి మజ్జిలిపేటలోని పుట్టింటికి వచ్చింది.
పొందూరు: మండలంలోని మజ్జిలిపేటలో శుక్రవారం అర్ధరాత్రి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ దేవానంద్ కథనం మేరకు.... హైదరాబాద్లో భర్త గౌరీతో పాటు ఉంటున్న పైడి ఝాన్సీ (30) ఎనిమిది నెలల కిందట ప్రసవానికి మజ్జిలిపేటలోని పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి తండ్రి వద్దే ఉంటోంది. ఝాన్సీకి నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. ఆమె మృతితో కుమారుడు అనాథగా మారాడు. శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంటిలో కుమార్తె కనిపించ కపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా ఇంటికి సమీపంలో ఉన్న బావిలో కని పిం చింది. బయటకు తీసినప్పటికే ప్రాణంపోయినట్లు గుర్తించారు. కడుపునొప్పి తాళ లేకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఝాన్సీ తండ్రి సూర్యారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ పి.అమల సమక్షంలో శవపంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసును నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.