ప్యాకేజీ ఇచ్చే వరకూ పనులు నిలిపివేయండి

ABN , First Publish Date - 2022-01-22T06:05:53+05:30 IST

విశాఖ -చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ పరిధి గ్రామాల్లో రైతులకు ప్యాకేజీ ఇచ్చే వరకూ పనులు చేపట్టకూడదని రైతు సంఘం, సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. రాజయ్యపేట, బుచ్చిరాజుపేట గ్రామాల్లో రెండు రోజుల నుంచి ఏపీఐఐసీ అధికారులు యంత్రాలతో చేపడుతున్న పనులను శుక్రవారం సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు.

ప్యాకేజీ ఇచ్చే వరకూ పనులు నిలిపివేయండి
బుచ్చిరాజుపేటలో పనులు అడ్డుకున్న దృశ్యం

నక్కపల్లి, జనవరి 21: విశాఖ -చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ పరిధి గ్రామాల్లో రైతులకు ప్యాకేజీ ఇచ్చే వరకూ పనులు చేపట్టకూడదని రైతు సంఘం, సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. రాజయ్యపేట, బుచ్చిరాజుపేట గ్రామాల్లో రెండు రోజుల నుంచి ఏపీఐఐసీ అధికారులు యంత్రాలతో చేపడుతున్న పనులను శుక్రవారం సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు.  2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ప్యాకేజీ ఇచ్చే వరకూ పనులు చేపట్టకూడదన్నారు. వీరికి జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్‌, టీడీపీ మండలశాఖ అధ్య క్షుడు కొప్పిశెట్టి వెంకటేశ్‌, రాజయ్యపేట సర్పంచ్‌ పిక్కి అప్పలనర్స, మత్స్యకార నాయకులు పిక్కి  కామేశ్వరరావు, స్వామి తదితరులు మద్దతు ప్రకటించారు. 

Updated Date - 2022-01-22T06:05:53+05:30 IST