ప్రభుత్వ భూముల ఆక్రమణలు అరికట్టండి

ABN , First Publish Date - 2022-01-23T03:34:12+05:30 IST

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములకు మోక్షం కల్పించాలంటూ శనివారం కర్లపూడి గ్రామస్థులు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణలు అరికట్టండి
తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కర్లపూడి గ్రామస్థులు

కోట, జనవరి 22 : కబ్జాకు గురైన ప్రభుత్వ భూములకు మోక్షం కల్పించాలంటూ శనివారం కర్లపూడి గ్రామస్థులు  స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కర్లపూడి పంచాయతీలోని  భూములను స్థానికులతోపాటు చిల్లకూరు మండ లానికి చెందిన కొందు కబ్జా చేశారన్నారు. ఆ భూముల్లోకి దిగరాదంటూ గతంలో రెవెన్యూ అధికారులు పెట్టిన బోర్డులు తొలగించి మళ్లీ ఆక్రమించుకున్నారన్నారు. రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించి ఆ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దారు పద్మావతికి  వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2022-01-23T03:34:12+05:30 IST