ప్రాథమిక పాఠశాలల విలీనం నిలిపివేయండి
ABN , First Publish Date - 2022-07-01T06:33:46+05:30 IST
ప్రాథమిక పాఠశాలల్లో మూడు, నాలుగు తరగ తులు హైస్కూల్లో విలీనం చేయడాన్ని నిలిపివేయా లని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యా యులు స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఎమ్మెల్యే ధర్మశ్రీకి ఏపీటీఎఫ్ ఉపాధ్యాయుల వినతి
చోడవరం, జూన్ 30: ప్రాథమిక పాఠశాలల్లో మూడు, నాలుగు తరగ తులు హైస్కూల్లో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యా యులు స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీని కలిసి వినతిపత్రం సమర్పించారు. పాఠశాలల విలీనం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉన్నందున విలీనాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని ఎమ్మెల్యేలు సహకరించాల న్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రినాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు నాయుడు, చోడవరం, బుచ్చెయ్యపేట మండలాల నాయకులు మధు, కృష్ణ, దేముడుబాబు, రొంగలి చిరంజీవి, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.