పర్యాటకుల సంఖ్య తగ్గించాలి జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ గౌరీపతి

ABN , First Publish Date - 2021-04-22T06:10:19+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్నందున ఏపీ జెన్‌కో, లోయర్‌ సీలేరు, మోతుగూడెం, అప్పర్‌ సీలేరుల్లో పర్యాటకుల సంఖ్య తగ్గించాలని చీఫ్‌ ఇంజనీర్‌ గౌరీపతి సిబ్బందికి మెమో నెం.393 జారీ చేశారు.

పర్యాటకుల   సంఖ్య తగ్గించాలి   జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ గౌరీపతి

మోతుగూడెం, ఏప్రిల్‌ 21: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్నందున ఏపీ జెన్‌కో, లోయర్‌ సీలేరు, మోతుగూడెం, అప్పర్‌ సీలేరుల్లో పర్యాటకుల సంఖ్య తగ్గించాలని చీఫ్‌ ఇంజనీర్‌ గౌరీపతి సిబ్బందికి మెమో నెం.393 జారీ చేశారు. పని ప్రదేశాల్లో తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్లు వాడాలని, నిత్యం ముట్టుకునే వస్తువులను ఏరోజు కారోజు శుభ్రం చేసుకోవాలని, ఏపీ జెన్‌కో, గెస్ట్‌హౌస్‌, హాస్టల్‌, పవర్‌ హౌస్‌లకు వచ్చే పర్యాటకుల సంఖ్యను తగ్గించాలని ఆదేశించారు. తక్కువ మందితో సమావేశాలు ఏ ర్పాటుచేయాలని, లేకపోతే వాయిస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాలు నిర్వహించుకోవాలని ఆఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ఎగు వ, దిగువ సీలేరు కాంప్లెక్స్‌ల్లో పనిచేస్తున్న జెన్‌కో ఉద్యోగులు, సిబ్బంది కొవిడ్‌ నిబంధ నలు తప్పకుండా పాటించాలని కోరారు.





Updated Date - 2021-04-22T06:10:19+05:30 IST