కొత్త రైతు చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం

ABN , First Publish Date - 2021-04-17T05:30:00+05:30 IST

కేంద్రప్రభు త్వం ఎన్ని అణిచివేత చ ర్యలకు పూనుకున్నా కొత్త వ్యవసాయ చట్టాలు రద్ద య్యే వరకు ఢిల్లీ సరిహ ద్దుల్లో జరుగుతున్న రైతు పోరాటం ఆగదని ఆల్‌ ఇండియా కిసాన్‌ మజ్దూర్‌ సభ ప్రధానకార్యదర్శి అశోక్‌ ఘయాల్‌ స్పష్టం చేశారు. శనివారం ఒంగో లులోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావే శంలో ఆయన మాట్లాడారు.

కొత్త రైతు చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం
సమావేశంలో మాట్లాడుతున్న అశోక్‌ఘయాల్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 17 : కేంద్రప్రభు త్వం ఎన్ని అణిచివేత చ ర్యలకు పూనుకున్నా కొత్త వ్యవసాయ చట్టాలు రద్ద య్యే వరకు ఢిల్లీ సరిహ ద్దుల్లో జరుగుతున్న రైతు పోరాటం ఆగదని ఆల్‌ ఇండియా కిసాన్‌ మజ్దూర్‌ సభ ప్రధానకార్యదర్శి అశోక్‌ ఘయాల్‌ స్పష్టం చేశారు. శనివారం ఒంగో లులోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు దారాదత్తం చేసేందుకు మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ బిల్లు-2020 ముసాయిదా తెచ్చారని ఆరోపించారు. రైతులకు ఇచ్చే సబ్సిడీలను రద్దు చే స్తూ కార్పొరేట్‌ సంఘాలకు పెద్ద మొత్తంలో ప్రజల ఆస్తులను దోచిపెట్టేం దుకు  కుట్ర పన్నారని విమర్శించారు. కార్యక్రమంలో  ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు కె.హనుమంతరావు, నాయకులు సీఎస్‌.సాగర్‌, బి.పద్మ, అరుణోయ అంజయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-17T05:30:00+05:30 IST