ఆగిన సచివాలయం పనులు
ABN , First Publish Date - 2021-07-22T04:50:05+05:30 IST
మండలంలోని గొడిగనూరు గ్రామంలో సచివాలయ భవన పనులు ఆగిపోయాయి.
చాగలమర్రి, జూలై 21: మండలంలోని గొడిగనూరు గ్రామంలో సచివాలయ భవన పనులు ఆగిపోయాయి. భవన నిర్మాణానికి పిల్లర్లు వేసి పనులు చేయకుండా వది లేశారు. సచివాలయ భవన పనులు పూర్తికాకపోవడంతో సంబంధిత శాఖ అధికారులు, సచివాలయ ఉద్యోగులు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. నెలలు గడుస్తున్న భవన పనులు ముందుకు సాగడం లేదు. ఈ విషయం గురించి పీఆర్ఏఈ కొండారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వర్షాల వల్ల పనులు ముందుకు సాగ లేదని అన్నారు. పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.