అయితే ప్రస్తుతం పెరుగుతున్న చలి వాతావరణంలో రైతులు పలు అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నాన్ మోల్లాహ్ మాట్లాడుతూ రెండు నెలలుగా తామంతా విపరీతమైన చలి కారణంగా పలు అవస్థలు పడుతున్నామని, అయితే ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకుండా చర్చల పేరిట తేదీలను మారుస్తున్నదన్నారు. ఏదిఏమైనప్పటికీ తాము ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.