స్ట్రేచర్పై Public Exam రాసిన విద్యార్థి
ABN , First Publish Date - 2022-05-18T15:03:14+05:30 IST
తిరునల్వేలిలో జరిగిన ప్రమాదంలో కాలుకు గాయమై శస్త్రచికిత్స చేయించుకున్న విద్యార్థి స్ర్టెచర్పై వచ్చి ప్లస్ టూ పబ్లిక్ పరీక్ష రాశాడు. తిరునల్వేలి జిల్లా కోట ప్రాంతానికి చెందిన
పెరంబూర్(చెన్నై): తిరునల్వేలిలో జరిగిన ప్రమాదంలో కాలుకు గాయమై శస్త్రచికిత్స చేయించుకున్న విద్యార్థి స్ర్టెచర్పై వచ్చి ప్లస్ టూ పబ్లిక్ పరీక్ష రాశాడు. తిరునల్వేలి జిల్లా కోట ప్రాంతానికి చెందిన అజారుద్దీన్ అదే ప్రాంతంలోని కామరాజ్ కార్పొరేషన్ మహోన్నత పాఠశాలలో ప్లస్ టూ చదువుతూ, ప్రస్తుతం జ రుగుతున్న పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నాడు. ఇటీవల బైక్పై వెళుతూ ప్రమాదానికి గురైన అజారుద్దీన్ తిరునల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడ అతడి కాలుకు శస్త్రచికిత్స చేసిన నేపథ్యంలో, మంగళవారం జరిగిన గణితం పరీక్ష తప్పకుండా రాయాలని అతడు వైద్యులను కోరాడు. విద్యార్థి ఆసక్తి గమనించిన వైద్యులు అనుమతించడంతో అంబులెన్స్లో పరీక్షా కేంద్రానికి వెళ్లిన అజారుద్దీన్ స్ర్టెచర్పై ఉంటూనే పరీక్ష రాశాడు. అతడికి సహాయంగా ఉపాధ్యాయుడు వ్యవహరించాడు.