వీధిలైట్లు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST

వీధిలైట్లు ఏర్పాటు చేయాలి

వీధిలైట్లు ఏర్పాటు చేయాలి
ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుకు వినతిపత్రమిస్తున్న ఎంపీటీసీ శ్రీనివాస్‌

మేడ్చల్‌ అర్బన్‌, మే 15 : అలియాబాద్‌ చౌరస్తా నుంచి అలియాబాద్‌ గ్రామం వరకు వీధిలైట్లను ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజును ఆ గ్రామ ఎంపీటీసీ సగ్గు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీశ్‌గౌడ్‌, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. ఆదివారం ఎంపీటీసీ సగ్గు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజును ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్సీని వారు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అలియాబాద్‌ చౌరస్తా నుంచి అలియాబాద్‌ గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహం వరకు వీధిలైట్లు లేక రాత్రిపూట ప్రయాణికులు నిత్యం అనేక ప్రమాదాలకు గురవుతున్నారని, ఈ రోడ్డు నిరంతరం ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుందని వారు ఎమ్మెల్సీకి వివరించారు. ఎమ్మెల్సీ కోటా నుంచి నిధులు కేటాయించాలని వారు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఎమ్మెల్సీ ఈ విషయమై సానుకూలంగా స్పందించారని, వీధిలైట్లను ఏర్పాటు చేయిస్తానని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Updated Date - 2022-05-15T05:30:00+05:30 IST