నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2021-04-24T04:50:18+05:30 IST
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- రాచకొండ అదనపు పోలీసు కమిషనర్ సుధీర్బాబు
ఘట్కేసర్ రూరల్ : కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ అదనపు పోలీసు కమిషనర్ సుధీర్బాబు హెచ్చరించారు. ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలోని వరంగల్-హైద్రాబాద్ జాతీయ రహదారి యంనంపేట్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్టును గురువారం అర్ధరాత్రి దాటాక తనిఖీ చేశారు. వాహనాదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. రాత్రి సమయంలో కర్ఫ్యూ ఉంటుందని, బయట సంచరించవద్దని ప్రయాణికులకు సూచించారు. ఈ సందర్భంగా విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న కార్మికులను, ఐటీ ఉద్యోగులను తనిఖీ చేసి సరైనా ఆధారాలు ఉన్నవారిని వదిలిపెట్టారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి ఏసీపీ శ్యామ్ప్రసాద్, సీఐ ఎన్. చంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.