Mumbai bomb blast: యూకూబ్ మెమన్ సమాధి అలంకరణ...బాధ్యులపై సీఎం చర్యలు
ABN , First Publish Date - 2022-09-09T16:30:03+05:30 IST
1993 ముంబై బాంబు పేలుళ్ల దోషి(Mumbai bomb blast) యాకూబ్ మెమన్ సమాధిని(Yakub Menon grave) అందంగా( beautification) తీర్చిదిద్దిన ఘటనపై...
ముంబయి(మహారాష్ట్ర): 1993 ముంబై బాంబు పేలుళ్ల దోషి(Mumbai bomb blast) యాకూబ్ మెమన్ సమాధిని(Yakub Menon grave) అందంగా( beautification) తీర్చిదిద్దిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే(Eknath Shinde) విచారణకు(enquiry) ఆదేశించారు.పేలుళ్ల దోషి సమాధిపై స్మారక చిహ్నం నిర్మించేందుకు మాజీ మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని బీజేపీ(bjp) ఆరోపించింది.యూకూబ్ సమాధిపై సుందరీకరణ ప్రక్రియ జరుగుతున్నట్లు టీవీ ఛానళ్లలో వార్తలు వెలువడటంతో దీనిపై సీఎం షిండే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
పేలుళ్ల దోషి సమాధిని అలంకరించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సీఎం షిండే ప్రకటించారు. యూకూబ్ సమాధితో గ్రానైట్ తో అందంగా తీర్చిదిద్ది ఎల్ఈడీ లైట్లను అమర్చారు.పేలుళ్ల దోషి సమాధిని ముస్తాబు చేయడంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ముంబయి పోలీసులు జోక్యం చేసుకుని లైట్లను తొలగించారు.