తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-04-24T04:24:07+05:30 IST

కొవిడ్‌ నివారణ నిమిత్తం ప్రభుత్వం ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని మండల విద్యాధి కారి పద్మలత హెచ్చరించారు.

తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
ప్రైవేట్‌ పాఠశాల నిర్వాహకులతో మాట్లాడుతున్న ఎంఈఓ

మైదుకూరు, ఏప్రిల్‌ 23: కొవిడ్‌ నివారణ నిమిత్తం ప్రభుత్వం ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని మండల విద్యాధి కారి పద్మలత హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని వివిధ ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తొమ్మిదో తరగతి వరకూ శెలవులు ఇవ్వాలని సూచించారు. కేవలం 10వ తరగతి విద్యార్ధులకు మాత్రమే బోధిం చాలని అలా చేయని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-04-24T04:24:07+05:30 IST