రోడ్లపై వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-07-28T05:45:25+05:30 IST

రోడ్లపై వ్యాపారం చేస్తూ ట్రాఫిక్‌ స్తంభించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్‌ సీఐ సిహెచ్‌.ప్రసాద్‌ హెచ్చరించారు.

రోడ్లపై వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు
స్థానిక ప్రజలు, వ్యాపారులతో మాట్లాడుతున్న సీఐ ప్రసాద్‌

ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌


అనకాపల్లి టౌన్‌, జూలై 27: రోడ్లపై వ్యాపారం చేస్తూ ట్రాఫిక్‌ స్తంభించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్‌ సీఐ సిహెచ్‌.ప్రసాద్‌ హెచ్చరించారు. కూరగాయల మార్కెట్‌ రోడ్డులో వ్యాపారాలు చేసే వారిని ఖాళీ చేయించారు. ఇక్కడ వ్యాపారాలు చేయడం వల్ల ట్రాఫిక్‌ స్తంభించి పాదచారులు, వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారని చిల్లర వర్తకులకు చెప్పారు. ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని సీఐ సూచించారు. మూడో దశ మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ రమేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T05:45:25+05:30 IST