లోకల్ శానిటైజర్లు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-08-07T10:59:38+05:30 IST
నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని శానిటైజర్లు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని పలమనేరు డీఎస్పీ ఆరీఫుల్లా హెచ్చరించారు.
పలమనేరు రూరల్: నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని శానిటైజర్లు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని పలమనేరు డీఎస్పీ ఆరీఫుల్లా హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పలమనేరు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మెడికల్షాపుల్లో ఐఎస్ఐ బ్రాండ్ కలిగిన కంపెనీ శానిటైజర్లు మాత్రమే విక్రయించాలని సూచించారు.