నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-06-22T05:54:41+05:30 IST
ఎరువులు, విత్తనాల దు కాణదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలోని దుకాణాలను టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. దుకాణాలలో నిల్వ ఉన్న స్టాక్ రికార్డులను పరిశీలించారు. ఎరువులు, విత్తనాలను ఎంఆర్పీ ధరలకంటే అధిక ధరలకు విక్రయాలు చేస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు చర్యలు చేపడుతామని తెలిపారు. కొనుగోలు చేసిన ప్రతీ రైతుకు తప్పనిసరిగా ఒరిజినల్ బిల్లులు ఇవ్వా లని తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ ఏడీ ఏ వినయ్కుమార్, ఏవో కమల, బిచ్కుంద మండలవ్యవసాయాధికారి పోచయ్య పాల్గొన్నారు.
బిచ్కుంద, జూన్ 21: ఎరువులు, విత్తనాల దు కాణదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలోని దుకాణాలను టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. దుకాణాలలో నిల్వ ఉన్న స్టాక్ రికార్డులను పరిశీలించారు. ఎరువులు, విత్తనాలను ఎంఆర్పీ ధరలకంటే అధిక ధరలకు విక్రయాలు చేస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు చర్యలు చేపడుతామని తెలిపారు. కొనుగోలు చేసిన ప్రతీ రైతుకు తప్పనిసరిగా ఒరిజినల్ బిల్లులు ఇవ్వా లని తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ ఏడీ ఏ వినయ్కుమార్, ఏవో కమల, బిచ్కుంద మండలవ్యవసాయాధికారి పోచయ్య పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తాం
పిట్లం: ఎరువుల దుకాణంలో వ్యాపారస్తులు నకిలీ వి త్తనాలు అమ్మితే అలాంటి వ్యాపారులపై చర్యలు తీసుకొని దుకాణం లైసెన్న్ రద్దు చేస్తామని ఏడీఏ వినయ్కుమార్ అన్నారు. మంగళవారం పిట్లంలోని ఎరువుల దుకాణాలలో ఆకస్మికంగా జిల్లా విత్తన ఎంఫోర్స్మెంట్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. దుకాణా లలో స్టాక్తో పాటు, బిల్లులు, బుక్కులు, లైసెన్స్లను పరి శీలించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఏవో కమల, పిట్లం ఏవో కిషన్, సిబ్బంది పాల్గొన్నారు.