కార్మిక వ్యతిరేక విధానాలు ఎండగడతాం

ABN , First Publish Date - 2020-11-27T04:48:15+05:30 IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతామని సీఐటీయూ నాయకులు అన్నారు.

కార్మిక వ్యతిరేక విధానాలు ఎండగడతాం

బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 26: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను  ఎండగడతామని  సీఐటీయూ నాయకులు అన్నారు. గురువారం బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దారుకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు కకావికలం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆదుకొనే చర్యలు చేపట్టకుండా ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. ముందుగా బుచ్చిలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మల్లికార్జున, జానీబాషా, శ్రీనివాసులు, రాచయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T04:48:15+05:30 IST