మా పొలం ఇప్పించండి
ABN , First Publish Date - 2021-05-07T06:00:19+05:30 IST
తమ పొలం ఇప్పించాలని గురువారం మంత్రాలయం తహసీల్దార్ కార్యాలయం ముందు పరమాన్దొడ్డి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ధర్నా చేసింది.
- తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితుల నిరసన
మంత్రాలయం, మే 6: తమ పొలం ఇప్పించాలని గురువారం మంత్రాలయం తహసీల్దార్ కార్యాలయం ముందు పరమాన్దొడ్డి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ధర్నా చేసింది. సుగాలి బాలప్ప, దానమ్మ తెలిపిన వివరాలు మేరకు.. తమ పొలాన్ని అధికారులు తమకు తెలియకుండా ఇతరులకు ఆన్లైన్లో నమోదు చేశారని ఆరోపించారు. గతంలో ఓ వీఆర్వో తమ పాస్ బుక్కులను తీసుకొని ఆన్లైన్లో ఎంట్రీ చేస్తామన్ని చెప్పి ఇతరుల వద్ద డబ్బును తీసుకొని తమ పొలాన్ని వారి పేరుమీద అన్లైన్లో నమోదు చేసి మోసం చేశారన్నారు. తమకు నాయ్యయం చేయా లని భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఈ నిరసన చేపట్టారు. తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన దరఖాస్తును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారిస్తున్నామని తెలిపారు.