రాజీవ్గాంధీ ఆశయ సాధనకు కృషి
ABN , First Publish Date - 2022-05-22T05:22:28+05:30 IST
స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ త్యాగాలను మరవలేమని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ అన్నారు.
- కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ
- ఘనంగా మాజీ ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ వర్ధంతి
సిరిసిల్ల టౌన్, మే 21: స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ త్యాగాలను మరవలేమని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ అన్నారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్గాంధీ 31వ వర్ధంతిని నిర్వహించారు. రాజీవ్గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ దేశం కోసం రాజీవ్గాంధీ కుటుంబం ప్రాణాలు అర్పించిందన్నారు. రాజీవ్గాంధీ ప్రధాన మంత్రిగా దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. పేద ప్రజల అభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజలకు కార్యకర్తలు వివరించాలని కోరారు. రానున్న రోజులో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కార్యదర్శి వెంగళ అశోక్, కార్యదర్శి కాసర్ల రాజు, సిరిసిల్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షుడు నక్క నర్సయ్య, కాంగ్రెస్ యూత్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్, కాంగ్రెస్ పార్టీ , యూత్ పట్టణ నాయకులు కొండ శ్రీనివాస్, చిందం శ్రీనివాస్, మంగ కిరణ్, సంతోష్, సతీష్, త్యాగరాజు, వెంకటేశం పాల్గొన్నారు.