టీడీపీ బలోపేతానికి కృషి చేయండి: కిశోర్‌

ABN , First Publish Date - 2021-07-25T06:22:41+05:30 IST

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

టీడీపీ బలోపేతానికి  కృషి చేయండి: కిశోర్‌
కిశోర్‌రెడ్డిని కలిసిన టీడీపీ నాయకులు

కురబలకోట, జులై 24: టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఇటీవల రాజంపేట పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అయూబ్‌ బాషా, టీడీపీ మండల అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌తో పాటు తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆయన్ను కలిసి సన్మానించారు.. ఈ సందర్భంగా ఆయన నియోజకవ ర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలను చర్చించారు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు.

Updated Date - 2021-07-25T06:22:41+05:30 IST