సీపీఎస్ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-01-25T06:04:24+05:30 IST
సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ జోసఫ్సుధీర్బాబు పేర్కొన్నారు.
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జోసఫ్సుధీర్బాబు
గుంటూరు(విద్య), జనవరి 24: సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ జోసఫ్సుధీర్బాబు పేర్కొన్నారు. ఆదివారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం శాశ్వత బదిలీ కోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీ మల్లికార్జునరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు ఎస్.రామచంద్రయ్య, కార్యదర్శి పెదబాబు తదితరులు పాల్గొన్నారు.