బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి: మంత్రి హరీశ్ రావు
ABN , First Publish Date - 2022-02-11T00:54:01+05:30 IST
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు
సిద్దిపేట: ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అంతేకాకుండా రైతులపై భారం వేసిందన్నారు. జిల్లాలోని నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో లబ్ధిదారులకు స్పింక్లర్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచడం తప్ప, రైతులకు చేసిందేమీ లేదన్నారు. ఉత్తర ప్రదేశ్లో ఎన్నికలు కాగానే పెట్రో భారం ఖాయమన్నారు. నియోజకవర్గ పరిధిలో మూడు వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారన్నారు. రైతులు అంతర పంటలు వేసి కొత్త పద్ధతులు అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.