ఆన్‌లైన్ గేమ్స్ ఆడవద్దనందుకు విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-04-30T15:36:14+05:30 IST

ఆన్‌లైన్ గేమ్స్ ఆడవద్దన్నందుకు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

ఆన్‌లైన్ గేమ్స్ ఆడవద్దనందుకు విద్యార్థి ఆత్మహత్య

శ్రీ సత్య సాయి: ఆన్‌లైన్ గేమ్స్ ఆడవద్దన్నందుకు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ముదిగుబ్బ మండలం గుట్టకిందపల్లికి చెందిన విద్యార్థి సంతోష్ కుమార్(20) పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మొబైల్లో ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన సంతోష్ కుమార్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం మధ్యలో మానేసి ఇంటి వద్దే ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుకుంటున్నాడు. దీంతో సంతోష్ కుమార్‌ను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లాగా... పరిస్థితి విషమించడంతో సంతోషకుమార్ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-04-30T15:36:14+05:30 IST