ఆ కుర్రాడు స్కూలు ఎగ్గొట్టి బయట తిరుగుతున్నాడు.. ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసింది.. దీంతో ఆ కుర్రాడు ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే..

ABN , First Publish Date - 2022-01-08T16:16:37+05:30 IST

ఆ కుర్రాడు పదో తరగతి చదువుతున్నాడు.. రోజూ తన గ్రామం నుంచి టౌన్‌కు వెళుతుంటాడు..

ఆ కుర్రాడు స్కూలు ఎగ్గొట్టి బయట తిరుగుతున్నాడు.. ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసింది.. దీంతో ఆ కుర్రాడు ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే..

ఆ కుర్రాడు పదో తరగతి చదువుతున్నాడు.. రోజూ తన గ్రామం నుంచి టౌన్‌కు వెళుతుంటాడు.. అయితే ఆ కుర్రాడు స్కూల్‌కు వెళ్లకుండా బయటే స్నేహితులతో కలిసి తిరుగుతున్నాడు.. ఇలా చాలా రోజులుగా జరుగుతోంది.. ఇటీవల ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసిపోయింది.. వారు కొడతారనే భయంతో ఆ కుర్రాడు ఘోరానికి పాల్పడ్డాడు.. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.


రాజస్థాన్‌లోని ఝంఝును‌లోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్లో భూపేంద్ర అనే కుర్రాడు పదో తరగతి చదువుతున్నాడు. రోజూ సమీప గ్రామం నుంచి ఆటోలో టౌనుకు వెళుతుంటాడు. అయితే స్కూలు దగ్గర దిగిపోయి లోపలికి వెళ్లకుండా బయటకు వెళ్లిపోతుంటాడు. స్నేహితులతో కలిసి సినిమాలకు, షికార్లకు తిరగుతుంటాడు. ఇటీవల పాఠశాల యాజమాన్యం ద్వారా ఆ విషయం భూపేంద్ర తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో భూపేంద్రకు భయం మొదలైంది. 


వారు కొడతారనే భయంతో శుక్రవారం మధ్యాహ్నం భూపేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూలుకు సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇతర విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న పాఠశాల ప్రిన్సిపాల్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. 

 

Updated Date - 2022-01-08T16:16:37+05:30 IST