విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-07-25T05:58:54+05:30 IST

మండలంలోని చిన్నతుంబళం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

పెద్దకడబూరు, జూలై 24: మండలంలోని చిన్నతుంబళం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మహదేవ్‌ కుమారుడు సురేష్‌(15) పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఇంటిపైకి కోతి తీసుకెళ్లిన గిన్నెను తెచ్చుకునేందుకు వెళ్లాడు. అయితే మిద్దెపై తలకు తగిలే ఎత్తులో ఉన్న విద్యుత్‌ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికి వచ్చిన కుమారుడు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-25T05:58:54+05:30 IST