చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2021-04-18T06:07:55+05:30 IST
రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి కర్నూల్ ప్రభు త్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి చింతావిశ్వనాథ్(15) శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ధర్మవరంఅర్బన, ఏప్రిల్ 17: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి కర్నూల్ ప్రభు త్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి చింతావిశ్వనాథ్(15) శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన చింతా విశ్వనాథ్ బీఎస్ఆర్ బాలుర ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మూడు రోజులక్రితం సైకిల్పై వస్తున్న విద్యార్థిని వెనుకవైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విశ్వనాథ్ను స్థానికులు అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెంది నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.