కెనాల్‌లో పడి ఇంటర్‌ విద్యార్థి గల్లంతు

ABN , First Publish Date - 2021-01-17T05:21:54+05:30 IST

మండలంలోని కారుమంచి గ్రామంలోని అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద శనివారం ఈతకు వెళ్ళి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇంటర్‌మీడియట్‌ విద్యార్థి గల్లంతయ్యాడు.

కెనాల్‌లో పడి ఇంటర్‌ విద్యార్థి గల్లంతు

కారుమంచి (శావల్యాపురం), జనవరి 16: మండలంలోని కారుమంచి గ్రామంలోని అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద శనివారం ఈతకు వెళ్ళి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇంటర్‌మీడియట్‌ విద్యార్థి గల్లంతయ్యాడు.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... టీడీపీ కారుమంచి గ్రామ అధ్యక్షుడు చింతనిప్పుల చౌదరిబాబు కుమారుడు సాయి విఘ్నేష్‌ (17) శనివారం సాయంత్రం ఈతకని పక్కనే ఉన్న అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌ వద్దకు స్నేహితులతో కలసి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలవలో పడిపోయాడు. స్నేహితులు ఎంత వెతికినా అతని జాడ కనిపించక పోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు సాయి విఘ్నేష్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


Updated Date - 2021-01-17T05:21:54+05:30 IST