గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యం

ABN , First Publish Date - 2021-10-27T05:50:38+05:30 IST

సదుం బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యమయ్యాడు.

గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యం

సదుం,అక్టోబరు 26: సదుం బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ ధరణీధర్‌ కథనం మేరకు.. చౌడేపల్లెకు చెందిన భార్గవి కుమారుడు తరుణ్‌ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం 10.30 గంటల ప్రాంతంలో ఉపాధ్యాయులకు చెప్పకుండా స్కూల్‌ నుంచి వెళ్లిపోయాడు.  సోమ వారం విద్యార్థి కుటుంబ సభ్యులతో మాట్లాడగా తరుణ్‌ ఇంటికి వెళ్లలేదని తెలిసింది. దీంతో తరుణ్‌ అదృశ్యంపై సదుం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిసినవారు 9440900701 తెలియ జేయాలని కోరారు.

Updated Date - 2021-10-27T05:50:38+05:30 IST