పాఠశాలల విలీనంపై Anantapurలో మిన్నంటుతున్న ఆందోళనలు

ABN , First Publish Date - 2022-07-07T14:42:01+05:30 IST

పాఠశాలల విలీనంపై ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

పాఠశాలల విలీనంపై Anantapurలో మిన్నంటుతున్న ఆందోళనలు

అనంతపురం: పాఠశాల(Schools)ల విలీనంపై ఉమ్మడి అనంతపురం (Anantapur) జిల్లాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పాఠశాలల విలీనం వద్దే వద్దంటూ విద్యార్థుల(Students)తో కలిసి తల్లిదండ్రుల(Parents) పాఠశాలలకు  తాళం వేసి నిరసన తెలుపుతున్నారు. ‘‘నీ అమ్మఒడి వద్దు... మా బడి మాకు ముద్దు’’ అంటూ బ్రహ్మసముద్రం మండలం అజ్జయ్యదొడ్డి విద్యార్థినుల ఆవేదన చెందుతున్నారు. అజ్జయ్యదొడ్డి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెలిమేపల్లికి వెళ్లి విద్యార్థినిలు ఏడవ తరగతి చదువుతున్నారు. పాఠశాల విలీనంలో భాగంగా వేపులపర్తి హై స్కూల్‌ను దూరం చేయొద్దంటూ వేడుకుంటున్నారు. వేపులపర్తికి హై స్కూల్‌కు వెళ్లాలంటే 12 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తుందని, పాఠశాలను విలీనం చేసి చదువుకు దూరం చేయవద్దని విద్యార్థినులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2022-07-07T14:42:01+05:30 IST