US వెళ్లే విద్యార్థులకు తీపి కబురు

ABN , First Publish Date - 2022-06-26T18:25:30+05:30 IST

ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లే విద్యార్థులకు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ తీపి కబురు చెప్పింది.

US వెళ్లే విద్యార్థులకు తీపి కబురు

హైదరాబాద్: ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లే విద్యార్థులకు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ తీపి కబురు చెప్పింది. I-20 దరఖాస్తు దాఖలు చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూల కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని వెల్లడించింది. అలాగే వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 14 నుంచి స్లాట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. F, M, J కేటగిరీల కింద స్లాట్స్ కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇక ప్రతియేట భారత్‌ నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం యూఎస్ వెళ్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు అమెరికా వెళ్లారు. 



Updated Date - 2022-06-26T18:25:30+05:30 IST