పరిసరాలు శుభ్రం చేసిన విద్యార్థులు

ABN , First Publish Date - 2021-10-27T05:53:24+05:30 IST

గుండుగొ లను ఎస్‌ఎంఎస్‌ఆర్‌ జడ్పీ హైస్కూలు ఆవరణలో ఎన్‌సీసీ విద్యార్థులు పారి శుధ్య కార్యక్రమాలు చేప ట్టారు.

పరిసరాలు శుభ్రం చేసిన విద్యార్థులు
తణుకులో జాతీయ నాయకుల విగ్రహాలు శుభ్రం చేస్తున్న విద్యార్థినులు

భీమడోలు, అక్టోబరు 26 :మండలంలోని గుండుగొ లను ఎస్‌ఎంఎస్‌ఆర్‌ జడ్పీ హైస్కూలు ఆవరణలో ఎన్‌సీసీ విద్యార్థులు పారి శుధ్య కార్యక్రమాలు చేప ట్టారు. క్లీన్‌ ఇండియా, సేవ్‌ ఇండియాలో భాగంగా పాఠశాలలో చదువుతున్న 79 మంది విద్యార్థులు పరిస రాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ ఆఫీసర్‌ భీమేశ్వరరావు, ప్రధానోపాధ్యాయురాలు జి.సునీత విద్యార్థులు పాల్గొన్నారు. 

తణుకు: క్లీన్‌ ఇండియాలో భాగంగా ఆంధ్రా కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నర్‌ అలోక్‌రాయ్‌ ఆదేశాలు మేరకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల ఎన్‌సీసీ విద్యార్థి నులు మంగళవారం ఎన్‌టీఆర్‌ పార్కు వద్ద ఉన్నజాతీయ నాయకులు విగ్రహా లను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కరుటూరి రామకృష్ణ, యు. లక్ష్మీసుందరీబాయి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-27T05:53:24+05:30 IST