జాతీయ ఫెన్సింగ్ పోటీలకు విద్యార్థులు
ABN , First Publish Date - 2021-03-03T06:03:39+05:30 IST
కటక్లో 10న జరగబోయే జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు హర్షితశర్మ ఎంపికైనట్లు డీవీఎం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.గోవిందరెడ్డి మంగళవారం హర్షం వ్యక్తంచేశారు.
బెలగాం: కటక్లో 10న జరగబోయే జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు హర్షితశర్మ ఎంపికైనట్లు డీవీఎం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.గోవిందరెడ్డి మంగళవారం హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 22, 23 తేదీల్లో జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో, 26, 27 తేదీలలో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో 7వ తరగతి చదువుతున్న హర్షితశర్మ, 8వ తరగతి చదువుతున్న చైతన్య జోషి తమ ప్రతిభ కనపర్చి ఫెన్సింగ్ పోటీలలో ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు.