కరోనా కష్టకాలంలో గురు దక్షిణ

ABN , First Publish Date - 2020-08-09T07:28:46+05:30 IST

పాఠాలు చెప్పి జీవితాలు తీర్చి దిద్దిన గురువు కు కరోనా కష్టకాలంలో గురు దక్షిణ అందించి..

కరోనా కష్టకాలంలో గురు దక్షిణ

జగిత్యాల అర్బన్‌, ఆగస్టు 08: పాఠాలు చెప్పి జీవితాలు తీర్చి దిద్దిన గురువు కు కరోనా కష్టకాలంలో గురు దక్షిణ అందించి శిష్యులు బాసటగా నిలిచారు. జ గిత్యాల పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ పాఠశాలలో 1993-94 ఎస్సెస్సీ చదివిన పూర్వ విద్యార్థులు తమ గురువు రాం కిశోర్‌కు కరోనా కష్ట కాలంలో రూ. 85లు ఆర్థికసాయం అందించి తమ గురు భక్తిని చాటుకున్నారు. ఈ కా ర్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి తుంగూరు సురేష్‌, మెన్నేని శ్రీధర్‌, పెద్ది రజినీకాంత్‌, సంతోష్‌, మఠం శివకుమార్‌ తదితరులున్నారు.    

Updated Date - 2020-08-09T07:28:46+05:30 IST