విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే బీరం
ABN , First Publish Date - 2021-12-08T04:39:26+05:30 IST
విద్యార్థులు ఓ లక్ష్యం నిర్దే శించుకొని జీవితం లో ముందుకు సాగాలని అప్పుడే ఉన్న త శిఖరాలను అధిరోహించగలుగు తారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు.
కొల్లాపూర్, డిసెంబరు 7 : విద్యార్థులు ఓ లక్ష్యం నిర్దే శించుకొని జీవితంలో ముందుకు సాగాలని అప్పుడే ఉన్న త శిఖరాలను అధిరోహించగలుగు తారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్ హాల్లో గాదెల రత్నాప్రభాకర్రెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ గాదెల సుధా రాణి నిర్వహించిన మోటివేషన్ కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. మోటివేషనల్ వేణుకల్యాణ్ విద్యార్థులు భవిష్యత్తులో రాణించాల్సిన అంశాలను క్లుప్తంగా వివరిం చారు. అనంతరం ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ తన ఆత్మీయుడు మిత్రుడు రత్నాప్రభాకర్రెడ్డి అకాల మరణం తనకు ఎప్పటికీ బాధిస్తోందని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ సాధన కోసం చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి ఎంతో మంది పేదలకు సేవ చేయడంతోపాటు విద్యార్థుల్లో మనోధైర్యం నింపేందుకు మోటివేషనల్ కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం రత్నాప్రభాకర్రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎంపీపీ గాదెల సుధారాణి మాట్లాడుతూ రత్నాప్రభాకర్రెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద ప్రజలకు సేవ చేసేందుకు సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు తాను ఎల్లప్పుడు ముందుంటానని ఆమె పేర్కొన్నారు.