ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లుపై ఆందోళన

ABN , First Publish Date - 2021-12-05T05:24:48+05:30 IST

వర్సిటీలో హాస్టళ్ల ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని ఎస్కేయూ అఽధికారులు చెప్పడం తో శనివారం విద్యార్థులు ఆందోళనకు దిగా రు. ప్రఽధాన ముఖద్వారం గేటుమూసి అక్కడే బైఠాయించి, ప్రభుత్వ తీరుపై నిరనస వ్యక్తం చేశారు.

ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లుపై ఆందోళన

ప్రధాన ముఖద్వారం వద్ద నిరసన తెలిపిన ఎస్కేయూ విద్యార్థులు

అనంతపురం అర్బన, డిసెంబరు 4: వర్సిటీలో హాస్టళ్ల ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని ఎస్కేయూ అఽధికారులు చెప్పడం తో శనివారం విద్యార్థులు ఆందోళనకు దిగా రు. ప్రఽధాన ముఖద్వారం గేటుమూసి అక్కడే బైఠాయించి, ప్రభుత్వ తీరుపై నిరనస వ్యక్తం చేశారు. ఎస్కేయూలో 6వ తేదీ నుంచి పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు సెకెండ్‌సెమ్‌ పరీక్షలు నిర్వహించనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో విద్యార్థులు పెద్దఎత్తున బైఠాయించి వర్సిటీ పాలనాధికారుల తీరును ఎండగట్టారు. ప్రవేశాల్లో ప్రతిభ కనబర్చి ప్రభుత్వం అందించే ఉచిత పీజీ కోర్సు లు చేస్తున్న తమను ఫీజులు చెల్లిస్తేనే హాల్‌ టికె ట్లు మంజూరు చేస్తామని అధికారులు వేధించటం ఏంటని ప్రశ్నించారు. సంవత్సరానికి వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.20 వేలు ఇస్తామని చెప్పి రూ.10వేలు మాత్రమే చెల్లించిందన్నారు. ఎస్కేయూ అధికారులు మాత్రం మొత్తం సొమ్మును చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామంటూ తమ భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. గేటు తె రవాలని పోలీసులు హెచ్చరించినా విద్యార్థులు తగ్గలేదు. రిజిస్ర్టార్‌ కృష్ణకుమారి ఫీజు ల చెల్లింపులకు గడువు పొడిగిస్తున్నామని ప్ర స్తుతం అందరికి హాల్‌టికెట్లను మంజూరు చేస్తామని హామీనివ్వడంతో విద్యార్థులు శాంతించారు. విద్యార్ధి సంఘాల నాయకుల వేమ న్న, ప్రసాద్‌, పలిరాజు, చంద్ర, తదితరులు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.


Updated Date - 2021-12-05T05:24:48+05:30 IST