విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN , First Publish Date - 2021-12-04T05:12:17+05:30 IST

గొంతు దిగని గోరుముద్ద అనే కథనానికి స్పందించి మంత్రాలయం ఎమ్మెల్యే వంట ఏజెన్సీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

కోసిగి, డిసెంబరు 3: గొంతు దిగని గోరుముద్ద అనే కథనానికి స్పందించి మంత్రాలయం ఎమ్మెల్యే వంట ఏజెన్సీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మండల ఇన్‌చార్జి మురళీమోహన్‌రెడ్డి, ఎంపీపీ ఈరన్నతో కలిసి శుక్రవారం కోసిగిలోని బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులను అడిగి మధ్యాహ్న భోజన మెనూ గురించి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించకుంటే వంట ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని వైసీపీ మండల ఇన్‌చార్జి మురళీమోహన్‌ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షుడు మహంతేష్‌ స్వామి, ప్రధానోపాధ్యాయులు నీలకంఠ, కోఆప్షన్‌ మెంబర్‌ షౌకత్‌ ఆలి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T05:12:17+05:30 IST