విద్యార్థులు వివరాలను సరిచూసుకోవాలి
ABN , First Publish Date - 2021-03-06T08:33:29+05:30 IST
వార్షిక పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్థులు వారి వివరాలను ఆన్లైన్ సరిచూసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కోరారు.
ఇంటర్బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్
హైదరాబాద్,మార్చి 5 (ఆంధ్రజ్యోతి): వార్షిక పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్థులు వారి వివరాలను ఆన్లైన్ సరిచూసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ కోరారు. గ్రూప్, మీడియం, సబ్జెక్టు, ద్వితీయ భాష, ఇతర వివరాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు ఎస్ఎ్ససీ హాల్ టికెట్ నంబరును, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం హాల్టికెట్ నంబరును సరిచూసుకోవాలన్నారు. ఏమైనా తప్పులుంటే కళాశాల ప్రిన్సిపల్ ద్వారా సరిచేసుకోవాలని విద్యార్థులను కోరారు.