ర్యాగింగ్‌ భూతానికి విద్యార్థులు దూరంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-28T04:16:55+05:30 IST

విద్యార్థినీ, విద్యార్థులు ర్యాగింగ్‌ భూతానికి దూరంగా ఉండాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి సూచించారు.

ర్యాగింగ్‌ భూతానికి విద్యార్థులు దూరంగా ఉండాలి
మాట్లాడుతున్న పాపిరెడ్డి

ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి

సంగారెడ్డి క్రైం, జూలై 27 : విద్యార్థినీ, విద్యార్థులు ర్యాగింగ్‌ భూతానికి దూరంగా ఉండాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి సూచించారు. ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ విద్యార్థులతో వర్చువల్‌ పద్ధతిన మంగళవారం ర్యాగింగ్‌ నిషేధం చట్టం గురించి అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌ చేయడం వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్‌ పాడైపోతుందన్నారు. అంతేగాక విద్యార్థులు మానసికంగా, భౌతికంగా కృంగిపోతారని, ర్యాగింగ్‌ చేసిన వారు, చేయడానికి ప్రోత్సహించిన వారు శిక్షార్హులని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్‌.ఆశాలత, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ జలీల్‌, మహిళా శిశు సంక్షేమ జిల్లా అధికారి పద్మావతి, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T04:16:55+05:30 IST